భూమిపై విచిత్రమైన జీవజాతులు ఎన్నో ఉన్నాయి.. మనిషి పుట్టుక ఒక పెద్ద పరిణామ క్రమం అని చెప్పాలి. ఆనతి ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మనిషి వరకు జరిగిన పరిణామక్రమాన్ని తీసుకుంటే ఎన్నో వింతకు విడ్డూరాలు కనిపిస్తుంటాయి. మనిషి అభివృద్ధి చెందేదశలో .. మారే దిశల్లో ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి మనిషి ట్రై చేస్తున్నాడు.
ట్రై చేయడం కాదు.. ఇప్పటికే చందమామపై అడుగు పెట్టిన మనిషి అతి త్వరలోనే అంగారక గ్రహంపై గృహం కట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇది సాధ్యమైతే మనిషి తన అభివృద్ధిలో ఎంతో ఎత్తుకు ఎదిగినట్టే అవుతుంది. మనిషి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదు. మజిలీలు మాత్రమే ఉంటున్నాయి. రిస్క్ తీసుకోవడంలో మనిషి చాలా హుషారుగా ఉంటున్నాడు .
అయితే, ఇప్పుడు మనిషి పరిశోధనలు గ్రహాంతర వాసుల చుట్టూజరుగుతున్నాయి . ఈ విశాలమైన విశ్వంలో మనిషి కంటే గొప్ప నాగరికత కలిగిన జీవులు ఉన్నాయని మనిషి నమ్మకం. వారి గురించి తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ వంటివి వస్తున్నాయని, ఆ ఫ్లైయింగ్ సాసర్స్ లో గ్రహాంతర జీవులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు. అమెరికాలోని ఏరియా 51 లో మనుషుల మనుగడను నిషేదించారు. కారణం ఏంటి అంటే అక్కడికి గ్రహాంతర జీవులు వస్తుంటాయని అంటున్నారు.
ఇదిలా ఉంటె,గ్రహాంతర జీవులు గ్రహంల్లోనే కాదు.. ఇటు సముద్రంలో కూడా ఉన్నాయని అంటున్నారు. సముద్రం అడుగున ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వేరే గ్రహాల నుంచి వచ్చి సముద్రం అడుగున మనుగడ సాగిస్తున్నాయని అంటున్నారు. ఇటీవలే సముద్రంలో పరిశోధన చేస్తున్న సమయంలో ఓ విచిత్రమైన జంతువు ఒకటి దొరికింది. అది చూడటానికి అడ్డదిడ్డంగా పెరిగిన వేర్లులా ఉంటుంది. దాన్ని పరిశీలనగా చూస్తే మనిషి ఉన్నట్టుగానే రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అది సముద్రంలో ఉండే గ్రహాంతర జీవి అని దాన్ని నీళ్లలో వదిలేయని డిమాండ్ చేశారు నెటిజన్లు. ఈ డిమాండ్ మేరకు ఆ జీవిని తిరిగి నీటిలో వదిలేశారు. ఒకవేళ అది పెరిగిపెద్దదయ్యి.. ది లాస్ట్ వరల్డ్ సినిమాలోలా భూమిని పరిస్థితి ఏంటి.. ఇదేమి హాలీవుడ్ సినిమా కాదు వెంటనే పరిష్కారం కనుగొనడానికి.