అనుమానం పెను భూతం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎన్ని లీటర్ల పాలు అయిన చిన్న ఉప్పు కళ్లుకు విరిగిపోతాయి. అలానే పచ్చటి సంసారాలలో చిన్న అనుమానపు బీజం మొదలైతే సంసారాలు నాశనం అవుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలు ఉండాలి. అనుమానం మొదలైతే ఇంక సంసారాలు గందరగోళం అవుతాయి.అలాంటి ఘటన ఇక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భార్య పై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులను కూడా అతి కిరాతకంగా చంపాడు.అనంతరం శవాలపై రేప్ చేశాడు. 



వివరాల్లోకి వెళితే.. ఈ అత్యంత అమానుష ఘటన హర్యానాలో వెలుగుచూసింది. సోనిపట్ జిల్లా పట్టి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ కుటుంబంతో పానిపట్ జిల్లా సమల్క పట్టణంలో నివాసముంటున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలంగా నుంచి భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు.ఆమె అక్రమ సంబంధానికి అత్తింటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనుకున్నాడు.భార్య, ఆమె చెల్లెలిని దారుణంగా మారణాయుధాలతో నరికి చంపేశాడు. అనంతరం వారి మృతదేహాలపై నీచానికి పాల్పడ్డాడు. ఇద్దరి శవాలపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడికి సమీపంలోని బుర్షం గ్రామంలో ఉంటున్న అత్తింటికి వెళ్లి అతి కిరాతకంగా ఆమెను చంపాడు. 



వారి మరణం పై ఎవరికి అనుమానం కలగకుండా శవాలను మూడు చోట్ల పడేశాడు.కొద్దీ రోజుల క్రితం నూర్ భార్య శవాన్ని పోలీసులు గుర్తించారు.తర్వాతి రోజు అతని మరదలు శవాన్ని మరో చోట వెలికి తీశారు. తర్వాత రెండు రోజులకు అత్త శవాన్ని గుర్తించారు. ఆమె శవాన్ని కనిపెట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చాడు. ఈ మూడు హత్యల గురించి పోలీసులు విచారణ చేపట్టారు. అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని గుర్తించారు.పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.హత్యానేరం, ఆధారాలు ధ్వంసం చేయడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: