గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఒక ట్రెండ్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలుగా ఒక పెద్ద స్థాయిలో చలామణి అవుతూ ఉన్న వారు దాదాపు చాలా మంది తమ వ్యాపార పెట్టుబడుల కోసం బ్యాంక్ ల నుండి అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం, వాటిని తిరిగి బ్యాంకు లకు చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి వారిలో ముఖ్యంగా మనము చెప్పుకోవలసింది విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లు గురించి, వీరంతా కూడా గతంలో అప్పులు తీసుకుని సదరు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పోయి దాక్కున్నారు. వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాము.

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు వీరికి కొమ్ము కాస్తున్నారు, లేదంటే వీరికి ఉన్న ఆస్తులను జప్తు చేయొచ్చు కదా అంటూ వివిధ విమర్శలు, ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఆ విమర్శలు  అన్నింటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాపార వేత్తలకు సంబంధించి తీసుకున్న మొత్తం అప్పుల్లో రూ. 18 వేల కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలెక్ట్ చేసిందని భారత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇప్పటి వరకు అక్రమ నగదు చలామణి చట్టం కింద 4700 కేసులను ఈడి విచారించింది. ఈ కేసులు అన్నింటిలోనూ రూ. 67 వేల కోట్ల వరకు వారి నుండి స్వాధీనం చేకున్నామని వివరాలతో సహా సుప్రీం కోర్టు కు తెలిపింది.

ఇప్పటికే మనము అనుకున్న విధంగా ఈడికి ఇచ్చిన అధికారాలను పలువురు ప్రశ్నిస్తూ పెట్టిన కేసుల పై నిన్న సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా కేంద్రం ఈ విషయాలను సుప్రీం కోర్టు కు అందచేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ కోర్టులు ఇలాంటి వారికి కల్పిస్తున్న ప్రొటెక్షన్ కారణంగా ఇంకా కోట్ల డబ్బు వారి నుండి ఈడి కలెక్ట్ చేయలేపోతోందని చెప్పారు. ఈ ఒక్క ప్రకటనతో ఎందరో రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చేసిన విమర్శలకు సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: