ఇక తెలంగాణలో ఎన్నికల జోరు కనిపిస్తుండడంతో దుబ్బాక లో గులాబీ దండు విజయం సాధించడం ఖాయమనై చెప్తున్నారు.. వాస్తవానికి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ కి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.. ఎప్పుడు ఓడిపోకపోగా భారీ మెజారిటీ తో విజయం సాధించింది. దుబ్బాక లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందని గులాబీ నేతలు అభిప్రాపపడుతున్నారు.. ఇక ఇటీవలే కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికలు కూడా దగ్గరపడుతుండడంతో ఆ ఎన్నికలపై తెరాస ఫోకస్ పెట్టింది..
అందుకోసం కేటీఆర్ రంగంలోకి దిగారు..ఇటీవలే నగరంలో భారీ వర్షాలు కురిశాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో కేటీఆర్ నిలువెత్తు నీళ్లలో దిగి ఆయన కాలనీల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయం.. తక్కువే అనే అభిప్రాయం ఏర్పడకుండా.. ప్రభుత్వం తరపున ఇంకా సాయం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. నవంబర్లో గ్రేటర్ ఎన్నికలు పెట్టి వందకుపై కార్పొరేటర్ సీట్లను గెలిచేసి.. సత్తా చాటాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆయనకు పట్టాభిషేకం కూడా ఉండే అవకాశం ఉంటుంది.