బిజెపి నేతలపై తెరాస ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత మంది దేశీయ దొంగలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రగల్భాలు పలికారు  అని మండిపడ్డారు. బీజేపీలో 172 మంది ఎంపీ ల పై ,26 మంది కేంద్ర మంత్రుల పై ఆరోపణలు ఉన్నాయి  అని అన్నారు. బీజేపీ దే మాఫియా పార్టీ  అని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ ఓ బోడి సంజయ్  అని మండిపడ్డారు. అభివృద్ధి పై బోడి సంజయ్ మాతో చర్చకు సిద్ధమా ? అని నిలదీశారు. రెండు ఎన్నికల్లో గెలవగానే బీజేపీ నేతలు గాల్లో సన్యాసం చేస్తున్నారు అని మండిపడ్డారు.

కొన్ని రోజుల్లోనే బండి సంజయ్ కథ ముగుస్తుంది  అని ఆయన హెచ్చరించారు. బండి సంజయ్ అసలు హిందువేనా ?డిఎన్ఏ టెస్ట్ చేయించాలి  అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయక పారి పోయిన వ్యక్తి కిషన్ రెడ్డి  అని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసికి ఒక్క పైసా తేలేనోడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు  అని మండిపడ్డారు. నాగార్జున సాగర్ లో 200 శాతం గెలిచేది టీ ఆర్ ఏస్సే  అని ఆయన స్పష్టం చేసారు. ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ ను తిట్టేందుకే బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నట్లుంది అని మండిపడ్డారు.

పాకిస్థాన్ పని అయిపోయింది ..ఇపుడు చైనా అంటున్నారు అని విమర్శించారు. మేకిన్ ఇండియా లోగో కూడా విదేశాల్లోనే తయారు చేశారు అని విమర్శించారు. బీజేపీ పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలింది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ నేతలు హద్దులు దాటొద్దు ..ప్రజలే తరుముతారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు ఓ లెక్క ఉంది ..కేంద్రం ఎన్ని ఉద్యోగాల ఇచ్చింది అని నిలదీశారు. యూనిటీ స్టాట్యూ కూడా చైనా లో తయారు చేశారు అని అన్నారు. కెసిఆర్ ను ఎందుకు అరెస్టు చేస్తారు ?దేశం లో ఎక్కడా లేని సంక్షేమం అమలు చేస్తున్నందుకా అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: