ఎన్నో ఏళ్ల పాటు పాకిస్తాన్ జట్టుకు దూరమైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇక మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే రి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఇక తనకు వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు సర్ఫరాజ్.  దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 కాగా ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో పాకిస్తాన్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 86 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. దీంతో ప్రశంసలు అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఏకంగా 118 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. తద్వారా ఇక సర్ఫరాజ్ అహ్మద్ 8 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సర్జరీ నమోదు చేశాడు. దీంతో అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఈ సెంచరి తర్వాత సర్ఫరాజ్ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు అని చెప్పాలి.


 ఇలా ఎనిమిదేళ్ల తర్వాత సెంచరీ చేసిన తర్వాత ఏ ఆటగాడు అయినా సరే ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక తనదైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇక సర్పరాజ్ అహ్మద్ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గాల్లోకి ఎగురుతూ గ్రౌండ్ను పంచ్ చేస్తూ తన సెంచరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రెండవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న విషయం తెలిసిందే. అంతకుముందు మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా డ్రాగా ముగియడం గమనార్హం.
.

మరింత సమాచారం తెలుసుకోండి: