ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో బాబర్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో పాక్ జట్టు సఫారీలను 2-1 తో ఓడించింది. కాగా.. ఆ సిరీస్ ద్వారా బాబర్ 13 పాయింట్లు దక్కించుకున్నాడు. కోహ్లీపై 8 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. దీంతో టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. ఇటీవల కోహ్లీ ఇంగ్లండ్తో మాత్రమే వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో కూడా రెండు అర్థ సెంచరీలతో రాణించాడు. అంతేకాకుండా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టాప్ ప్లేస్ సొంతం చేసుకున్న బాబర్కు భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ విషెస్ చెబుతూనే చురకలంటించాడు. విరాట్కు ఛేజింగ్ అంటే చాలా ఇష్టమని, టాప్ ర్యాంక్ను కూడా త్వరలోనే తిరిగి దక్కించుకుంటాడని అన్నాడు. ఈ మేరకు తాజాగా ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. జాఫర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.