ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక మొన్నటివరకు ఫ్లిప్ కార్ట్  బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఏర్పాటు చేసి, అందులో ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించిన అన్ని వస్తువుల పై భారీ ఆఫర్ లను ప్రకటించింది. ఇప్పుడు మరొకసారి ఫ్లిప్ కార్ట్  యాపిల్ డేస్ సేల్  పేరిట యాపిల్ ఐఫోన్ ఆఫర్ ను  ప్రకటించింది. ఇప్పటివరకు ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదని కూడా ఫ్లిప్ కార్ట్ ఈ-కామర్స్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ ఆఫర్ వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఈ ఆఫర్ మే 14వ తేదీన ముగుస్తుంది. యాపిల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ,క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే, ఆరు వేల రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే యాపిల్ ఐఫోన్, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎస్ ఈ, మ్యాక్, యాపిల్ వాచ్ , యాపిల్ ట్యాబ్ లాంటి ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.. ఐప్యాడ్, ఐఫోన్, ఐపాడ్ టచ్, మ్యాక్, యాపిల్ ట్యాబ్ కొనేవారికి ఒక ఏడాదిపాటు యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్  ను కూడా ఉచితంగా అందించనుంది.


ఐఫోన్ 12:
స్మార్ట్ ఫోన్ 64 జీ బీ వేరియంట్ రిలీజ్ అయినప్పుడు దీని ధర రూ.79,990 . కానీ ఇప్పుడు ప్రస్తుత ధర రూ.77,990. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై రూ. ఆరు వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 12 మిని:
ఐఫోన్ మినీ స్మార్ట్ ఫోన్ కొత్తగా రిలీజ్ అయినప్పుడు దీని ధర రూ.69,900 ఉండగా, ప్రస్తుత ధర రూ.67,900 . ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుల ద్వారా ఆరు వేల రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 11:
దీని ధర పై మూడు వేల రూపాయలు తగ్గింది. ఇక ఇప్పుడు దీనిని రూ. 48,999 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

ఐఫోన్ ఎక్స్ ఆర్:
దీని ధర రూ.45,499 ఉండగా ప్రస్తుతం ఆఫర్ ధర రూ.36,999.

ఐఫోన్ ఎస్ ఈ:
దీని ధర ఇండియాలో రిలీజ్ అయినప్పుడు రూ.42,499 కాగా, ప్రస్తుతం దీని ధర రూ.30,499 గా ప్రకటించబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: