ఇక 5g స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో స్పెక్ట్రమ్‌ అమ్మకాల ద్వారా మొత్తం రూ.1.5 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చి చేరాయి.మొత్తం స్పెక్ట్రమ్‌లో మొత్తం 71 శాతం విక్రయించబడిందని కేంద్ర టెలికాం మత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రభుత్వంకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.ఊహించినదానికంటే ఎక్కువగా వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఏడో రోజు 5g స్పెక్ట్రమ్‌ వేలం ముగియగా, మొత్తం కూడా రూ.1.50,173 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఇంతటి విలువైన స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం మొబైల్‌ కంపెనీలకు విక్రయించడం జరిగింది. ఇంకా ఈ ఏడు రోజుల్లో మొత్తం 40 రౌండ్ల స్పెక్ట్రమ్‌ వేలం పాటలు జరిగాయి. ఇంకా అలాగే ఇందులో టెలికం కంపెనీలు జోరుగా వేలం పాటలు పాల్గొన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది బిడ్ల కంటే ఈ సారి రికార్డు స్థాయిలో ఆదాయాలు నమోదైనట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ముందుగా ప్రభుత్వానికి మొత్తం రూ.80000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక ఇందులో రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్‌ జియో మొత్తం వచ్చేసి 88,078 కోట్ల రూపాయల విలువైన 5g స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్ చేసింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లకు ఇంకా వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లకు, అదానీ గ్రూప్ కేవలం రూ.212 కోట్ల స్పెక్ట్రమ్‌కు బిడ్‌ దాఖలు చేశాయి. ఇక ఈ మేరకు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. 


ఆగస్టు 15 వ తేదీ నాటికి ఈ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తవుతాయని, కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ మొత్తం 5Gతో దేశం మొత్తాన్ని కవర్‌ చేయడానికి సరిపోతుందని మంత్రి తెలిపడం జరిగింది.వేలం వేసిన మొబైల్ కంపెనీలు మొత్తం రూ.7500 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఇంకా దీని తరువాత, ప్రభుత్వం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తుంది. కంపెనీలు సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఈ 5g సేవలను ప్రారంభించవచ్చు. స్పెక్ట్రమ్ వేలంలో ఓ పాల్గొన్న కంపెనీలలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇంకా గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. మొత్తం ఏడు రోజుల పాటు జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో మొత్తం నాలుగు టెల్కోలు రూ.1,50,173 కోట్ల స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేశాయి. ఇక ఇందులో రిలయన్స్ జియో వాటా 59 శాతానికి చేరువలో ఉంది. రిలయన్స్ జియో మొత్తం రూ.88,078 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: