
ఇకపోతే మరో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని గుంటూరు, ఎన్టీఆర్ , అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ ప్రాంతాలలో అధిక వర్షాలు నమోదు కాగా మొలకలచెరువులో 120.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు.
ఇకపోతే గురువారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం , పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణ , గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో కొన్నిచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. అలాగే విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం , తిరుపతి, కాకినాడ , నెల్లూరు , చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు , నంద్యాల, అన్నమయ్య జిల్లాలలో కూడా కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇక హైదరాబాదులో కూడా నిన్న సాయంత్రం నుంచి వర్షం పడడం ప్రారంభం అయింది. హైదరాబాద్ సిటీలోని దిల్ సుఖ్ నగర్ , సైదాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మల్కాజ్ గిరి , హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో వర్షాలు బాగా పడ్డాయి. ఇక ప్రజలు వర్షాల నుంచి అప్రమత్తంగా ఉండాలి అని రైతులకు కూడా తమ పంట విషయంపై జాగ్రత్త వహించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.