కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలను ఇప్పటికే సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు… తాజాగా కేసు విచారణలో భాగంగా సంజనాకు రక్త పరీక్షలు చేయడానికి ప్రయత్ని స్తుండగా ఆమె నిరాకరించింది. ఆసుపత్రిలో  రక్త నమూనా ఇవ్వడానికి సంజనరచ్చ...రచ్చ.... చేసింది. ఆమె చేసిన లొల్లికి పోలేసులు హడలి పోయారు. తాను రక్త పరీక్షలు చేయించుకోనని... ఒక వేళ తన రక్తాన్ని తీసుకున్నా, టెస్టు రిపోర్ట్ తనదేననే గ్యారెంటీ ఏమిటని ఆమె మండిపడ్డారు.


డ్రగ్స్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని... జనాల ముందు తనను పిచ్చిదాన్ని చేస్తున్నారని రచ్చ చేసింది. పోలీసులకు చుక్కలు చూపించింది.  . నటి రాగిణి, సంజనా డ్రగ్స్ తీసుకున్నట్లు  అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. నటి సంజనకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. ఆ సమయంలో రక్తపరీక్షలు చేయించుకోడానికి సంజనా మొండికేసి, నానా యాగీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: