కరోనా ప్రభావం వల్ల సామాన్యుడికి కష్టాలు పెరుగుతున్నాయి.. నిత్యావసర సరుకుల నుంచి తినే ప్రతి ఒక్క వస్తువు పై ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినా కూడా రేట్లు మాత్రం తగ్గలేదు..ఇక రోజు వారి అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై ధరలు ఒక్కోసారి ఒక్కోలా పెరుగుతున్నాయి. మొన్నా మధ్య రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి గ్యాస్ సిలిండర్ పై ధరను భారీ తగ్గింపు లభిస్తుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇంట్లో నుంచే మీరు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు..



డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం గ్యాస్ సిలిండర్‌పై మంచి ఆఫర్ అందిస్తోంది.పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే మంచి ఆఫర్ లభిస్తోంది. రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తోంది. హెచ్‌పీ, ఇండేన్, భారత్ గ్యాస్ వంటి వాటిని మీరు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి. మీకు హోమ్ స్క్రీమ్‌లో ఆప్షన్ కనిపించకపోతే షో మోర్‌పై క్లిక్ చేయాలని అంటున్నారు.ఇప్పుడు మీరు రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడు బుక్ గ్యాస్ సిలిండర్‌పై క్లిక్ చేయాలి. మీరు మీ గ్యా్స్ సిలిండర్ కంపెనీని ఎంచుకోవాలి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ వాటిల్లో మీ సిలిండర్ ఏదో ఓకే చేసుకోవాలి.



ఇకపోతే గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుంటే మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ నుంచి బుక్ చేసుకోవచ్చు.. లేదంటే ఎల్‌పీజీ ఐడీని ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత డబ్బులు కట్టాలో కూడా చూపిస్తుంది. కట్టేయాలి. అంతే మీ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలి. లేదంటే క్యాష్‌బ్యాక్ రాదు. ఫస్ట్ ఎల్‌పీజీ అనే కోడ్ ఎంటర్ చేసిన తర్వాతనే బిల్లు చెల్లించాలి. పేటీఎంలో తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని అనుకొనే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: