ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే స్టేషన్లలో రెడీ చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం) నుంచి అన్ రిజర్వ్‌డ్ టికెట్ కోనేందుకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.ఇంకా ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు కూడా తెలిపాయి. సౌత్ రైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లలో 254 అప్‌గ్రేడ్ ఏటీవీఎం లను రెడీ చేయాలని నిర్ణయించింది. అందువల్ల ప్రయాణీకులు UPI లేదా QR కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా టిక్కెట్ ఛార్జీని ఈజీగా చెల్లించవచ్చు. ఈ వెసులుబాటు ఏప్రిల్ నెల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం.. ప్రయాణీకులు తమ స్మార్ట్ కార్డ్‌ల R-వాలెట్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మాత్రమే టిక్కెట్‌లను కొనవచ్చు. చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ ఇంకా తాంబరంతో సహా ఎన్నో ప్రధాన స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు భారీగా క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.


డబ్బులు చెల్లించే విషయంలోనే ఆలస్యం ఎక్కువగా అవతుండటంతో ఇదే అంశంపై చాలా రకాల ఫిర్యాదులు కూడా అందాయి.దాంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.ఈ అప్‌గ్రేడ్ చేసిన ఏటీవీఎం కియోస్క్ స్క్రీన్‌పై ప్రయాణికులు తమ ప్రయాణ మార్గాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత వారు యూపీఐ ద్వారా పేమెంట్ చెల్లించవచ్చు. అదే సమయంలో ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను కూడా వాడవచ్చు.ఇక టికెట్ కౌంటర్లలో రద్దీని తగ్గించే లక్ష్యంతో 8 సంవత్సరాల క్రితం రైల్వే శాఖ ఏటీవీఎంలను ప్రవేశపెట్టింది. చెన్నై డివిజన్‌లో మొత్తం 34 ఏటీవీఎంలు ఇంకా దక్షిణ రైల్వేలోని మరో ఐదు డివిజన్లలో 65 ఏటీవీఎంలు పనిచేస్తున్నాయి. చెన్నై సబర్బన్ నెట్‌వర్క్‌లోని నాలుగు విభాగాల ద్వారా రోజుకు 11.5 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నా కానీ ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేయకపోవడం వలన వెండింగ్ మెషీన్‌ల వినియోగం కూడా చాలా తక్కువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: