విశాఖలో భూ అక్రమాల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఈ విషయంలో ఎవరు అయినా సరే ఉపేక్షించే ప్రశ్నే లేదని ఏపీ సర్కార్ స్పష్టం చేస్తుంది. ఇక విచారణకు ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయి అని అధికారులు గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే సిట్ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ...

విశాఖ భూకుంభకోణం పై, సిట్ పున ప్రారంభం అయింది అని చెప్పారు. కోవిడ్ కారణంగా ‍ ఇన్నాళ్ళు నిలిచిపోయిన , విచారణ ఇప్పుడు ప్రారంభించాం అని చెప్పారు. జిల్లా అధికారులు సిబ్బందితో మళ్లీ సమావేశం  ఏర్పాటు చేసి చర్చించాం అని ఆయన అన్నారు. నవంబర్ చివరి నాటికి నివేదిక అందిస్తాం అని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: