కొవిడ్​ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి డిశ్చార్జి అయిన కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మేయర్​ కనిపించకుండా పోయారు. తమకు మందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయనను డిశ్చార్జి చేశారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.


ఇటీవల బెంగళూరులో చెలరేగిన హింసాత్మక అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సంపత్ రాజ్. కరోనా సోకిి నగరంలోని ఓ ఆస్పత్రిలో అక్టోబరు 7న చేరారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని ఆరోజే బెంగళూరు నగర నేర విభాగ జాయింట్ కమిషనర్​ సందీప్​ పాటిల్​ ఆస్పత్రి అధికారులకు నోటీసులు ఇచ్చారు. అయినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సంపత్​ రాజ్​ను డిశ్చార్జ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: