ప్రేమ అంటే ఎన్నో మధురమైన జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఆ జంట ఈ లోకాన్ని మొత్తం మరిచి పోతుంది అని అంటూ ఉంటారు. ఇలా ప్రేమ గురించి వర్ణించమంటే ఎన్నో పదాలు కూడా సరిపోవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ నేటి రోజుల్లో ప్రేమ గురించి చూసుకుంటే మాత్రం ప్రేమ అనేది కేవలం ప్రాణాలు పోవడానికి మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది. ఎందుకంటే ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులు దారుణం గా హత్య చేస్తూ ఉంటే.. మరికొన్ని ఘటనలు తమ ప్రేమను గెలిపించలేకపోయాము అని చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ దారుణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


 ఇంకోన్ని ఘటనల్లో మానవ బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా ఏకంగా ప్రేమించిన వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందిందే అని చెప్పాలి. ఆమెకు అప్పటికే పెళ్లయింది. కానీ ఆ యువకుడు మాత్రం ఆ మహిళ మీద మనసు పడ్డాడు. ఎలాగైనా ఆ మహిళను తన వైపుకు తిప్పుకొని పెళ్లి చేసుకోవాలి అని భావించాడు. కానీ చివరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. తాను  ప్రేమించిన వివాహిక తనతో పెళ్లికి అంగీకరించలేదు అన్న కారణంతో దారుణంగా చివరికి కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశాడు.


 ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. శంషాబాద్ లో ప్రేమోన్మాది  దారుణానికి ఒడిగట్టాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వివాహితను వేధిస్తున్న యువకుడు ఆమె పెళ్లికి నిరాకరించడంతో చివరికి మహిళపై కిరోసిన్ పోసి నిప్పు పంపించాడు. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకున్నాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: