ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవరాసులు ఉన్నప్పటికీ అటు మనుషుల్లోనే కాస్త ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ క్షణంలో ఎలా నడుచుకోవాలి అనే విచక్షణ మనుషుల్లో ఉంటుందని అంటూ ఉంటారు. ఇక జంతువులు ఇలాంటి విచక్షణ కనిపించదు అని చెబుతూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలా విచక్షణతో నడుచుకోవాల్సిన మనుషులు ఏకంగా దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అడవుల్లో జీవించే క్రూర మృగాల కంటే దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి.


 వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరి నుండి ముప్పు ముంచుకు వస్తుందో అని అందరూ భయపడే పరిస్థితి ఉంది అని చెప్పాలి. అంతే కాకుండా సొంత వారిని కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితి నేటి రోజుల్లో కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక చిన్న చిన్న కారణాలకే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీసేస్తున్న తీరు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ఏకంగా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది అని చెప్పాలి.


 ఏకంగా పెళ్లిలో తినడానికి ప్లేట్స్ ఇవ్వలేదు అనే కారణాలతో ఒక వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ విహార్ లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన మ్యూజిక్ బ్యాండ్ సిబ్బంది భోజనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్లేట్స్ ఇవ్వాలి అంటూ కేటరింగ్ సిబ్బందిని అడిగారు. అయితే కేటరింగ్ సిబ్బందిలో ఒకడైన సందీప్ సింగ్ ప్లేట్లు కడుగుతున్నామని.. కాస్త టైం పడుతుందని చెప్పడంతో ఇక మ్యూజిక్ బ్యాండ్ సిబ్బంది అతనిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడిన సందీప్ మృతి చెందాడు. అయితే ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: