వారికి రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇక బంధు మిత్రులందరికీ సమక్షంలో ఘనంగా ఈ తంతు పూర్తి చేశారు వధువు కుటుంబ సభ్యులు. రాత్రి గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారూ. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు రిసెప్షన్ కి కొన్ని గంటల ముందే నవ దంపతులు ఇంట్లోని వారి గదిలో విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన ఛత్తీస్గడ్ రాజధాని రాయిపూర్ లోని బ్రిజన్ గర్ లో వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయినా ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అని చెప్పాలి. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఇక వారి శరీరాలపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని అనుమానిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఘటనతో అటు పెళ్ళింట్లో తీవ్ర విషాదం నెలకొంది అని చెప్పాలి.