ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం అనేది నేరాలకు చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి . ఎందుకంటే భార్యాభర్తల బంధం లోకి అడుగుపెట్టి కలకాలం కష్టసుఖాలను పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాల్సిన వారు.. బద్ద శత్రువులుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. చిన్న చిన్న కారణాలకే గొడవ పడుతూ చివరికి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న జంటలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలా కలిసి జీవించ లేనప్పుడు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్న పర్వాలేదు. కానీ కొంతమంది అయితే ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమరుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.


 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అక్రమ సంబంధాల నేపథంలో కొంతమంది ఏకంగా కట్టుకున్న వారిని హతమారుస్తూ ఉంటే ఇంకొంతమంది చిన్నచిన్న కారణాలకే దారుణంగా హత్యలు చేస్తూ ఉన్న ఘటనలు సభ్య సమాజంలో అందరిలో భయాందోళన పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక కర్ణాటక జిల్లాలో కూడా దారుణ ఘటన జరిగింది. పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి కనిపించని భార్య కలర్.. పెళ్లయిన కొన్నేళ్లకు మాత్రం కనిపించింది. దాదాపు పెళ్లయిన ఏడేళ్ల తర్వాత భార్య నల్లగా ఉందని దారుణంగా హత్య చేశాడు భర్త.


 జేవర్కి తాలూకాలోని కెల్లూరు కు చెందిన ఖాజాకు ఫర్జానాతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య నల్లగా ఉండడంతో ఖాజా తరచూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. ముఖానికి ఎంత పౌడర్ వేసిన హీరోయిన్ రూపం రావడం లేదు అంటూ సూటి పోటి మాటలతో బాడీ షేమింగ్ చేస్తూ తిట్టేవాడు. అదనపు కట్నం తేవాలి అంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై భార్యతో మరోసారి గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయిన ఖాజా చివరికి భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: