ఇదిలా ఉండగా ప్రమాదకరంగా పెరుగుతున్న కోవిడ్ సెకండ్ వేవ్ కేసుల నియంత్రణకు మొట్టమొదటగా లాక్డౌన్ ప్రకటించిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాల చర్యలు ఫలితాన్నిచ్చాయి. అక్కడి కేసుల పెరుగుదల రేటు అదుపులోకి వచ్చింది. ఇక భారతీయ వైద్య పరిశోధనామండలి( ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ పాజిటివ్ దేశవ్యాప్త సరాసరి రేటు ప్రస్తుతం 21 శాతంగా ఉంది. 48 శాతం పాజిటివిటీ రేటుతో గోవా ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండగా 37 శాతంతో హర్యాణా రెండో స్థానంలో ఉంది. పుదుచ్చేరి, కర్నాటక తరువాత స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో ఇది 9 శాతంగా ఉండగా, ఏపీలో 23 శాతం నమోదవుతోంది. దీనిని బట్టి చూస్తే ఏపీ పరిస్థితి కాస్త ప్రమాదకరంగానే ఉందని చెప్పాలి. ఏపీలో ఏక్టివ్ కేసుల సంఖ్య కూడా 1,97,00 దాటాయి.ఇక గత 24 గంటల్లో ఏపీలో 21,452 కొత్త కేసులు నమోదు కాగా, 89 మంది చనిపోయారు. తెలంగాణలో మంగళవారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తుండగా, ఏపీలో కూడా ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో..పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ సూచనల మేరకు మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ విధించక తప్పదేమోనన్న విశ్లేషణలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రమాదకరంగా పెరుగుతున్న కోవిడ్ సెకండ్ వేవ్ కేసుల నియంత్రణకు మొట్టమొదటగా లాక్డౌన్ ప్రకటించిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాల చర్యలు ఫలితాన్నిచ్చాయి. అక్కడి కేసుల పెరుగుదల రేటు అదుపులోకి వచ్చింది. ఇక భారతీయ వైద్య పరిశోధనామండలి( ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ పాజిటివ్ దేశవ్యాప్త సరాసరి రేటు ప్రస్తుతం 21 శాతంగా ఉంది. 48 శాతం పాజిటివిటీ రేటుతో గోవా ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండగా 37 శాతంతో హర్యాణా రెండో స్థానంలో ఉంది. పుదుచ్చేరి, కర్నాటక తరువాత స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో ఇది 9 శాతంగా ఉండగా, ఏపీలో 23 శాతం నమోదవుతోంది. దీనిని బట్టి చూస్తే ఏపీ పరిస్థితి కాస్త ప్రమాదకరంగానే ఉందని చెప్పాలి. ఏపీలో ఏక్టివ్ కేసుల సంఖ్య కూడా 1,97,00 దాటాయి.ఇక గత 24 గంటల్లో ఏపీలో 21,452 కొత్త కేసులు నమోదు కాగా, 89 మంది చనిపోయారు. తెలంగాణలో మంగళవారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తుండగా, ఏపీలో కూడా ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో..పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ సూచనల మేరకు మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ విధించక తప్పదేమోనన్న విశ్లేషణలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి.