అయితే ఐదేళ్లు పాలన చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ పాదయాత్రకు వస్తే జనాలు ఏ రకంగా అర్థం చేసుకుంటారన్నదే అసలు ప్రశ్న. అసలు సమస్యలే తెలియవు అన్న చోట సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం తప్పు కాదు ... ఇదే నారా లోకేష్కు కలిసి వచ్చింది. గతంలో ఆయన తండ్రి చంద్రబాబు రాష్ట్రాన్ని పాలన చేసినా లోకేష్కు పాదయాత్ర కొత్త కాబట్టి.. ఆయన పాదయాత్ర బాగానే కలిసి వచ్చింది. కానీ జగన్ గతంలో ఐదేళ్లు పాలన సాగించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఆయన పాలనపై ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లినా అవే సమస్యలు వస్తాయి.. అవే ఇబ్బందులు కలుగుతాయి. పైగా జగన్ ఐదేళ్ల పాలనపై జగన్ను నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రజల మధ్యకు రాకపోవడం లాంటివి మైనస్. ఏదేమైనా ఈ సారి జగన్ పాదయాత్ర చేస్తే ప్రజల నుంచే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవ్వడం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి