ఉదయం పూట నిద్ర లేచాక ఎక్కువగా అరటి పండు, ఎండు ద్రాక్ష, బాదం పప్పును ఖాళీ కడుపుతో కనుక తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఈ ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి అంది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అందుకే ఉదయం పూట రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కూడా మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మన శరీరతత్వాన్ని బట్టి ఇంకా మనకు ఉన్న సమస్యలను బట్టి, మన లక్షణాలను బట్టి అరటి పండు, బాదం, ఎండు ద్రాక్షను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా నీరసం వంటి సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.అయితే అరటి పండు ఇష్టం లేని వారు మాత్రం ఇతర పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇంకా అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు, ఊబకాయంతో బాధపడే వారు, కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఇంకా చర్మ పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారు మాత్రం నానబెట్టిన బాదంపప్పును పొట్టును తీసి ఖాళీ కడుపున తినాలి. అదే విధంగా రుతుక్రమం సరిగ్గా లేని స్త్రీలు కూడా నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఉదయం పూట ఖాళీ కడుపుతో ఖచ్చితంగా తినాలి. అలాగే మూడ్ స్వింగ్స్, రక్తహీనత ఇంకా నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఉదయం పూట ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది.ఉదయం నిద్ర లేచాక ఖచ్చితంగా ఇవి తినండి. అలాగే వీటిని తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ నీటిని కూడా తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: