ఇక ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని వాటిని బాగా వేడి చేయాలి.ఇంకా ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. డయాబెటిస్ ను నియంత్రించడంలో మెంతులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మెంతులను వాడడం వల్ల డయాబెటిస్ తో పాటు కీళ్ల నొప్పులు, అధిక బరువు, గాయాలు, దద్దుర్లు, మలబద్దకం ఇంకా అలాగే మూత్రాశయ సమస్యలు వంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ తరువాత ఈ నీటిలో రెండు రెమ్మల కరివేపాకును తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఈజీగా నియంత్రణలో ఉంటాయి.ఇంకా అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.మీ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఆ తరువాత ఈ నీటిలో ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి దాంట్లో వేసుకోవాలి. ఈ అల్లాన్ని వాడడం వల్ల డయాబెటిస్ చాలా ఈజీగా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ ల బారిన కూడా పడకుండా ఉంటాము. శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి.


తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో మంచి దివ్యౌషధంగా పని చేస్తుంది. దీనిలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచే గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మధుమేహం వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటాము.ఇప్పుడు ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే దాకా బాగా చల్లారనివ్వాలి.ఇక ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ కూడా మీరు ఉదయం పరగడుపున తాగాలి. అయితే దీనిలో ఎటువంటి ఇతర పదార్థాలను కలుపుకోకూడదు. ఇంకా ఈ పానీయాన్ని తాగిన తరువాత అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ప్రతిరోజూ కూడా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ విధంగా ఈ పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల వారు ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: