మనలో డీహైడ్రెషన్ వల్ల నోరు ఎండిపోవడం,అతి దాహం, తరుచూ తలనొప్పి, నిస్సత్తువ మూత్రవిసర్జన తగ్గడం వంటి లక్షణాలు కలుగుతాయి. వీటిని తగ్గించుకోవడానికి, చల్లని నీరు లేదా నీటి-ఎలక్ట్రోలైట్ లు వున్న పానీయం తీసుకోవచ్చు.ఇది చాలామందికి అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ కొంతమంది తరచుగా డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల, వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు,అందులోని ఎలక్త్రోలైట్స్ శరీరానికి అందవు.రక్తంలో సగానికి పైగా నీరు ఉంటుంది. కావున అ నీటి శాతం తగ్గిపోయి రక్తనాలాల్లో రక్తసరఫరా సరిగా జరగదు.దీనితో బ్లడ్ ప్రెసర్ అధికమవుతుంది.మరియు రక్తంలో సోడియం యొక్క అధిక సాంద్రతకు కారణమవుతుంది.

రక్తం పరిమాణం మరియు సోడియం స్థాయిలలో మార్పులను గ్రహించినప్పుడు శరీరం రెండు పనులు చేస్తుంది. మొదటిది, మీరు కొంత హైడ్రేషన్‌ను కనుగొనేలా దాహాన్ని ప్రారంభించడం, మరియు రెండవది యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్ (ADH) స్రావాన్ని ప్రేరేపించడం.వాసోప్రెసిన్ పెరుగుదలకు దోహదపడుతుంది.మూత్రపిండాలు లిక్విడ్ నష్టాన్ని నిరోధించడానికి మరియు సోడియం గాఢత మరింత పెరగకుండా ఉండటానికి నీటిని నిల్వ ఉంచుకోవాలి.ఇది రక్త నాళాలను ప్రెసర్ లేకుండా రక్తసరఫరా సక్రమంగా జరగడానికి కారణమవుతుంది.

తరుచూ డీహైడ్రేషన్ కీ గురవడం వల్ల అధిక బీపీ. పెరగడమే కాక ఊబకాయం, టైప్ 2 మధుమేహం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తగినంత నీరు తీసుకోవడం వల్ల తరచుగా ఉండే డీహైడ్రేషన్ తగ్గడం ,రక్తనాళాల పనితీరు మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి, ఈ మార్పుల కారణంగా అధిక బీపీ , రక్తం గడ్డకట్టడం,హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్‌లకు డీహైడ్రేషన్ అనేది మన శరీరం మనకిచ్చే ముందస్తు హెచ్చరికగా పరిగణించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కు గురవకుండా తగినంత నీరు, మరియు జ్యూస్ లు తాగడం అలవాటు చేసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: