దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుందా అంటే అటు రాజకీయ నాయకులు లేదు లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేదే ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే మాత్రం నేటి రోజుల్లో సరైన ఉద్యోగం దొరకక ఎంతో మంది యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోతూ ఉన్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేక.. మూడు పూటలా కడుపు నింపుకోలేక పస్తులు ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.


 అందుకే నేటి రోజుల్లో మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందా అంటే యువత మాత్రం తప్పకుండా అవును అనే సమాధానమే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు దొరక్క బాధపడుతూ ఉంది ఆ యువతే కదా. ఈ క్రమంలోనే కొంతమంది ఇక ఉద్యోగాల వేటలో చివరికి పస్తులు ఉంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ నిరుద్యోగి కడుపు నింపుకునేందుకు చేసిన పని కాస్త ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టేస్తుంది అని చెప్పాలి.



 తమిళనాడుకు చెందిన సంతోష్ అనే వ్యక్తికి 34 ఏళ్ళు. ఇక మంచి చదువులు చదివినప్పటికీ ఇప్పటివరకు అతనికి సరైన ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కోసం ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇక తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు సంతోష్. ఇక కడుపునిండా ఆహారం తినేందుకు ఒక విచిత్రమైన పని చేశాడు. ఏకంగా రైల్వే స్టేషన్ లో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో అతన్ని ఎంక్వయిరీ చేసేందుకు జైలుకు తరలించారు పోలీసులు. ఇక విచారణలో అతను చెప్పిన విజయం మాత్రం అందరి మనసును తాకుతుంది. జైల్లో మూడు పూటల ఆహారం దొరుకుతుందని ఇక ఫేక్ బాంబు కాల్ చేసినట్లు సంతోష్ తెలిపాడు. ఈ విషయం తెలిసి అందరూ నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: