ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులను వారి ఆర్థిక అవసరాలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. పండ్లు , పూల తోటల రైతులకు అదిరిపోయే అవకాశాన్ని అందిస్తోంది. వీటితోపాటు కూరగాయలు పండించే రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసి సరికొత్తగా అద్భుతమైన ఆలోచన చేసింది. ఈ ఆలోచనతో అటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా హార్టికల్చర్ పంటలు పండించే రైతులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అంతేకాదు సబ్సిడీ కూడా పొందవచ్చు. రిఫ్రిజిరేటర్ వెహికల్ కొనుగోలు పై 75% రాయితీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ బెనిఫిట్ కేవలం బీహార్ రైతులకు మాత్రమే వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. ముఖ్యంగా అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇలా రిఫ్రిజిరేటర్ వెహికల్ కొనుగోలు పై 75% రాయితీని ప్రకటించి రైతులకు ఆసరాగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు నష్టం తగ్గి ఆదాయం పెరిగే దిశగా సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ వెహికల్ వల్ల ట్రాన్స్పోర్ట్ స్టేషన్ సమయంలో నష్టం కలగదు. రైతులకు సబ్సిడీ అందిస్తున్నట్లు అక్కడి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఈ విధంగా ట్వీట్ చేసింది ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్స్ స్కీమ్ లో భాగంగా రైతులకు అలాగే ఎంటర్ప్నూర్లకు కూడా 50% సబ్సిడీ లభిస్తుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అంతేకాదు ఎఫ్.పి.సి లేదా ఎఫ్ పీ ఓ అయితే 75% వరకు సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ వెహికల్ ద్వారా రూ.26 లక్షలు ఉంటుంది. అంటే మీరు సబ్సిడీ రూపంలో ఏకంగా 13 లక్షల రూపాయలను తగ్గింపు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: