హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైనా మాస్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు గోపీచంద్.. మొదటిసారి తొలివలపు అంటూ హీరోగా ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాక కొద్దిరోజులు విలన్ గా మారి మళ్లీ యజ్ఞం సినిమాతో తన పంజా విసిరాడు గోపిచంద్. యజ్ఞం హిట్ తనలో కొత్త జోష్ నింపి ఇక అలానే ఫాం కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ గా జిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గోపీ  మరోసారి తనకు ఆంధ్రుడు లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ పరుచూరి మురళికి చాన్స్ ఇస్తున్నాడట. అయితే గోపీ ఈ టైంలో పరుచూరికి చాన్స్ ఇవ్వడం అందరిని ఆలోచనలో పడేసింది. 


ప్రస్తుతం కెరియర్ ఆశించినంత సక్సెస్ గా కొనసాక పోయినా హీరోగా ఒక పర్టిక్యులర్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు గోపిచంద్. అయితే ఈ హీరో సినిమా సినిమాకు కొంత గ్యాప్ తీసుకోవడం అది కూడా ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేయడంతో సరైన ప్రమోషన్ లేక సినిమాలు అటకెక్కుతున్నాయి. రీసెంట్ జిల్ సినిమాలో గోపి చాలా స్టైలిష్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. రాధాకృష్ణ కుమార్ చాలా స్టైలిష్ గా ఈ సినిమాను తెరకెక్కించినా గోపి ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకునే సరికి, జిల్ సినిమా ఆడియెన్స్ లోకి వెళ్లడం వీలు కాలేదు.


ఆంధ్రుడు సినిమాలో గోపీచంద్ :


ప్రస్తుతం బి.గోపాల్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్న గోపీచంద్ మళ్లీ పరుచూరి మురళికి అవకాశం ఇవ్వడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. దర్శకుడిగా కాస్త పాపులర్ గా ఉన్న వాళ్లతో సినిమాలు చేస్తే ఆడియెన్స్ కూడా సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు కానీ పుష్కరానికి ఓ సినిమా తీసే దర్శకులకు గోపీ చాన్స్ ఎందుకు ఇస్తాడో అర్ధం కావట్లేదు. ప్రస్తుతం రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'సౌఖ్యం' సినిమా చేస్తున్నాడు గోపీచంద్. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావొచ్చిన ఈ సినిమాలో హాట్ గాళ్ రెజినా హీరోయిన్ గా చేస్తుంది.


లౌక్యం తో రకుల్ ప్రీత్ సింగ్, జిల్ తో రాశి ఖన్నాలకు మంచి బ్రేక్ ఇచ్చిన గోపీ చంద్.. సౌఖ్యం సినిమాతో రెజినాకు కూడా సూపర్ క్రేజ్ వచ్చే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హీరోయిన్స్ షార్టేజ్ ఉన్న ఈ టైంలో ఎవరికి ఎవరో అన్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి మళ్లీ పరుచూరి మురళి గోపీచంద్ మెచ్చే స్టోరీతో మనముందుకు రాబోతున్నాడు. మరి మురళి మీద గోపీ ఉన్న నమ్మకాన్ని తను ఎంతవరకు వినియోగించుకుంటాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: