బిగ్ బాస్ సీజన్ 3 రోజులు గడిచే కొద్ది ప్రేక్షకులలో కొంచెం కొంచెం గా ఆదరణ పెంచుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇప్పటికే హాఫ్ షో ని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఫినాలే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ శుక్రవారం బిగ్ బాస్ హౌస్లో ఏంజరిగిందో ఒకసారి గమనిస్తే ...
బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ కి సీక్రెట్ ఎనలైజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల్ని సీక్రెట్గా కన్వెషన్ రూం పిలిచారు. అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత అక్కడ వాళ్లు ఏం చేసింది ఇంటి సభ్యులకు తెలియజేస్తారు. అప్పుడు ఇంటి సభ్యులు వాళ్లు చెప్పింది నిజమా.. అబద్ధామా అన్నది గెస్ చేయాలి , కరెక్ట్గా గెస్ చేస్తే బిగ్ బాస్ తరపున డిన్నర్ పార్టీ ఉంటుందని బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
మొదటిగా బాబా భాస్కర్ని సీక్రెట్ రూంకి పిలిచి ఫిజ్ తాగి రిలాక్స్ అవ్వమని 1 నుండి 100 వరకూ అంకెలు లెక్కపట్టమన్నారు. పూర్తైన తరువాత 100 నుండి 1కి వెనక్కి తిరిగి లెక్కపెట్టమనడంతో బాబాకి చుక్కలు కనిపించాయి. దీనితో బాబా తికమకపడ్డాడు. నేను ఎనిమిదో తరగతి ఫెయిల్ ఏబీసీడీలు నాకు రావు అనడంతో మీరు ఇంటి సభ్యులతో మాట్లాడి వెంటనే ఏబీసీడీలు నేర్చుకోండి అని సలహా ఇచ్చారు. ఆ తరువాత రాహుల్ వెళ్లి వచ్చి అల్లిన కథ నిజమో కాదో తెలుసుకునేందుకు.. అతని గుండెలపై తల పెట్టి అతని హార్ట్ బీట్ విని, రాహుల్ నిజమే చెప్తున్నాడని డిసైడ్ చేసేసింది. వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్ చెప్పేది అబద్ధమనిపిస్తుందని చెప్పగా., శ్రీముఖి అందరితో వాదించి నేను చెప్పింది కరెక్ట్ అంటూ గట్టగా చెప్పడం శ్రీముఖి మాట కి విలువ ఇచ్చి అందరూ రాహుల్ చెప్పిన దానికి ఓకే అన్నారు. దీనితో హౌస్ మేట్స్ అందరూ తప్పుగా గెస్ చేసారు అని చెప్పడంతో వరుణ్ , శ్రీముఖి మధ్య రచ్చ మొదలైంది.
ఆ తరువాత హిమజ, వరుణ్, వితికా, రవి , మహేష్ ఇలా ఒక్కొక్కరు వెళ్లి వాళ్లు చేసిన పనిని చెప్తే బయట ఉన్న శ్రీముఖి నాయకత్వంలోని ఇంటి సభ్యులు బాగానే గెస్ చేశారు. ముఖ్యంగా మహేష్ ..మహేష్ విట్టాను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. అయ్యో నిజంగా ఎలిమినేట్ అయ్యాడనుకుంటే పొరపాటే.. ఇది జస్ట్ సీక్రెట్ టాస్క్. మహేష్ నిజంగానే ఎలిమినేట్ అయినట్లు ఇంటి సభ్యులు నమ్మాలి. ఇది మహేష్కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కానీ , అందరిని నమ్మించడంలో మహేష్ విఫలమయ్యాడు. ఈ సర్ప్రైజ్ ఎలిమినేషన్ మహేష్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి ,,,