బిగ్ బాస్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా సాగింది. చివరి వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో సరిగ్గా చెప్పలేకపోయారు.  మహేష్, పునర్నవి ల మధ్య టఫ్ గా నడిచిన ఈ ప్రాసెస్ లో పునర్నవి ఎలిమినేట్ అయ్యింది. అయితే పునర్నవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ మెంబర్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక రాహుల్ సంగతి చెప్పనక్కర లేదు. అయితే  హౌస్ నుండి వెళ్ళిపోయిన  హిమజ మాత్రం సంబరాలు జరుపుకుంది.


పునర్నవి ఎలిమినేట్ అయ్యాక ఆమె టివి ముందు నిలబడి తీన్ మార్ స్టెప్పులు వేసి ఆనందంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే హిమజ ఇలా ఎందుకు చేసిందనే చర్చ నడుస్తుంది. హిమజ అభిమానులు మాత్రం ఆమె అలా చేయడాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆమె అలా చేయడానిఇ కారణాలు ఉన్నాయని అంటున్నారు.


హౌస్ లో ఉన్నప్పుడు పునర్నవి హిమజను ఆంటీ అని పిలుస్తూ కించపరిచినట్లుగా మాట్లాడిందని, అంతే కాదు చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలుండండం వల్లే హిమజ ఇలా చేసిందని అంటున్నారు. మరో పక్క పునర్నవి అభిమానులు మాత్రం ఆమె ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలిమినేట్ అయిన వ్యక్తిపై ఇంతటి ద్వేషం పనికి రాదని, ఆట హౌస్ వరకే పరిమితం కావాలని ఆమెకు హితభోధ చేస్తున్నారు.


ఒకానొక పునర్నవి అభిమాని ఎలిమినేట్ అయిన వ్యక్తి పట్ల మీరిలా ప్రవర్తించడం కరెక్టేనా అని హిమజని అడిగితే, దానికి ఆమె  ఎలిమినేట్ అయ్యి బయటకి వస్తే ఇద్దరం కలిసి పార్టీ చేసుకోవచ్చు కదా అందుకే ఈ సంతోషం అని వెటకారంగా మాట్లాడింది. మరి వీరిద్దరి మధ్య ఈ గొడవలు ఇక్కడితోనే ఆగుతాయా? మరింత ముందుకు వెళ్తాయా అనేది ముంచు ముందు చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: