సాధారణంగా ఒకప్పుడు ప్రేక్షకులను నవ్వించడానికి దర్శకులు సపరేట్ కామెడీ ట్రాక్ రాసేవారు. దీనీని కమెడియన్లతో చేయించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం హీరోలతోనే దర్శకులు కామెడీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు సైతం తాము కామెడీ చేయడంలో ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. టాలీవడ్ యంగ్ హీరో నితిన్ కూడా అదే చేశారు. దాదాపు సంవత్సరం గ్యాప్ తరువాత హీరో నితిన్ భారీ అంచనాలతో ఇటీవల విడుదలైన చిత్రం `భీష్మ`. ఈ చిత్రంలో నితిన్కు జోడీగా రష్మిక మందన్నా నటించింది.
వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. మరోవైపు కమర్షియల్ సినిమా కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తోన్న నితిన్ అభిమానులకు భీష్మ విందు భోజనంలా ఉందని చెప్పొచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం అనే పాయింట్తో.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు, తర్వాత ఉండే నితిన్ కామెడీ సీన్స్ సినిమాకు హెలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ కామెడీ సీన్స్ దాదాపు గంట పాటు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
సినిమా ఓపెనింగ్ నుండే నితిన్తో సరదా సరదా సన్నివేశాలు క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడం మొదలుపెట్టిన వెంకీ కుడుముల రోలింగ్ టైటిల్స్ వరకు కూడా ఆ కామెడీ కంటెంట్ని మిస్ చెయ్యలేదు. అందుకే కథలో ఉన్న లోపాలు కూడా పెద్దగా కనిపించలేదు. ఇక నితిన్ కామెడీ టైమింగ్ కు.. వెంకీ కుడుముల తోడవటంతో పాత కథనే అయినా కొత్తగా చూపించి హిట్ కొట్టారు. చాలా కాలం తరువాత నితిన్లోని కామెడీ యాంగిల్ని పూర్తిగా ప్రొజెక్ట్ చేసిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం వంటి హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత నితిన్కు భీష్మ సినిమా సూపర్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.