2016 లో దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ తెరకెక్కించిన అ..ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత వచ్చిన లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు వరసగా పరాజయమయ్యాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ మంచి కథలని ఎంచుకొని ఒక్కోక్కటిగా సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం భీష్మ సినిమాతో వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చి మరో సినిమాని మొదలు పెట్టాడు. 

 

రంగ్ దే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుండగా కీర్తి సురేష్ నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ అండ్ నితిన్, కీర్తి సురేష్పోస్టర్ అభిమానులని, ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తో పాటు చిత్రీకరణలో ఉండాల్సిన మరో రెండు సినిమాలు కరోనా కారణంగా నిలిచిపోయాయి. 

 

ఇక చిత్రీకరణ మొదలు పెట్టినప్పటికి సినిమాలు మాత్రం థియోటర్స్ లో రిలీజ్ అయ్యో అవకాశాలు ఇప్పట్లో లేవు కాబట్టి నితిన్ తన సినిమాల విషయంలో తొందరపడదలచుకోవడం లేదట. ప్రస్తుతం బ్యాలెన్స్ వర్క్ ఉన్న ఒక్క రంగ్ దే సినిమాని మాత్రమే కంప్లీట్ చేసి పరిస్థితులని బట్టి రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. మిగిలిన రెండు సినిమాలను మాత్రం కరోనా పరిస్థితులన్ని చక్కబడ్డాకే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. ఇక తాజాగా తన పెళ్ళి పత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కి అందించిన నితిన్ తప్పని సరిగా రావాలంటూ కోరాడు. ఈ నెల 26 న హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: