సమంత కమర్షియల్ మూవీస్ ని పూర్తిగా పక్కనపెట్టేసిందా.. ఓన్లీ హబ్బీ సినిమా అయితేనే కాల్షీట్స్ ఇస్తోందా అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ నాగచైతన్యకి మాత్రమే పరిమితం చేసిందని, మిగతా హీరోలకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదట. అందుకే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి మాత్రమే సైన్ చేస్తోందని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత ఎంత పెద్ద హీరోయిన్ అయినా మారిపోతుంది. దీనికి సమంత కూడా అతీతం కాదంటున్నారు టాలీవుడ్ జనాలు. సామ్ మిసెస్ నాగచైతన్యగా మారాక సినిమా సెలక్షన్ ని పూర్తిగా మార్చేసింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని దూరం పెడుతోంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని కట్ చేస్తోంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనే నటిస్తోంది సమంత.

సమంత పెళ్లి తర్వాత స్పీడ్ తగ్గించింది. ఇంతకుముందులా వరుస సినిమాలు చేయడం లేదు. పవర్ ఫుల్ రోల్స్ అయితేనే కాల్షీట్స్ అంటోంది. ఇక కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా పెద్దగా స్కోప్ ఉండట్లేదని, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వైపు వెళ్లిపోయింది. ‘యు-టర్న్, ఓ బేబీ’లాంటి సినిమాల్లో నటించింది. అలాగే హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉన్న ‘మజిలీ, జాను’ లాంటి సినిమాలు చేసింది.

సమంత నెక్ట్స్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతోందని సమాచారం. ఈ మూవీలో సామ్ చెవిటి, మూగ అమ్మాయిగా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ కి ఎక్కువగా స్కోప్ ఉండడంతో సామ్ ఈ ఫిజికల్లీ ఛాలెంజెడ్ క్యారెక్టర్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీ రోల్ ప్లేచేస్తాడని చెబుతున్నారు.

మొత్తానికి సమంత రెగ్యులర్ సినిమాలను పక్కన పెట్టేసింది. రెగ్యులర్ సినిమాలంటే ఖచ్చితంగా అందులో రొమాన్స్ ఉంటుంది. ఆ రొమాన్స్ కు ఇపుడు సమంత నో చెప్పేసింది. నాగచైతన్యతో మాత్రమే అయితే ఓకే.. ఇంకెవరికీ  స్క్రీన్ పై ఆ ఛాన్స్ లేదంటూ హింట్ ఇచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: