ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌ లలో ఒకరుగా ఉన్న సమంత మన టాలీవుడ్ లో  హీరోలు కూడా చేయని సాహసం చేస్తోందని అంటున్నారు. అదే షూట్ కి రెడీ అయిపోయినట్టు చెబుతున్నారు. ఇక చాలా మంది హీరోలు సహా సినీ జనం కాస్త డబ్బు సంపాదించాక ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద డబ్బు పెడుతూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఇలా పబ్లిక్ బిజినెస్ ల మీద పెడుతుంటారు. సమంతా కూడా సైలెంట్ గా  బ్రాండ్ బట్టల బిజినెస్ మొదలు పెట్టేసింది.

తాను నటిగా సినీ కెరీర్‌ ప్రారంభించడానికి ముందు.. మ్యాగజైన్‌లోని మోడల్స్‌ ఫ్యాషన్‌, వారి స్టైల్‌ను ఆసక్తిగా గమనించేదాన్నని కాలేజీ చదువుతున్న రోజుల్లో ఓ డిజైనర్‌ డ్రెస్‌ కొనే స్థోమత లేకపోవడం నాకింకా గుర్తుందని అలా మరే ఆడపిల్లా ఫీలవ్వ కూడదని అందుకే ఈ బిజినెస్ పెడుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఆమె షూట్ కి రెడీ అవుతోందని అంటున్నారు. జాను తరువాత సమంతా సినిమాల విషయంలో సైలెంట్ అయింది.

అంతకు ముందే ఒప్పుకున్న సినిమాలు తప్ప ఇప్పుడు కొత్తగా మరే సినిమా ఒప్పుకోలేదు. అయితే ఆమె నటించబోయే తదుపరి సినిమాని గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత ఒక మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు ముందు నుండీ ప్రచారం జరుగుతోంది. ఇలా శారీరక వైకల్యాలున్న పాత్రను సమంత చేయడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. బాలీవుడ్‌ సహా దక్షిణాది బాషలలో విడుదల కానున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా షూట్ కోసం ఆమె రెడీ అవుతోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: