టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయట్లేదు .. రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా చేసినా ఆ హిట్ రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో సమంత ది ఆ సినిమా లో ప్రేక్షక పాత్ర అయిపోయిందని చెప్పాలి.. యాక్టింగ్ విషయంలో ఇద్దరు సమ ఉజ్జీలుగా నటించిన రామ్ చరణ్ కి వచ్చినంత పేరు సమంత కు రాలేదు. డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది.. కానీ సమంత కు ఎక్కడ మిస్ అయ్యిందో తెలీదు కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు..

ఇక ఆ సినిమా తర్వాత సమంత కమర్షియల్ సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి.. ఆమెకు పెళ్ళయిపోవడం, ఇతర కుర్ర హీరోలు లైన్ లోకి రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా పెద్ద హీరోల సినిమాలు దూరమైపోయాయి.. అయితే ఆమెకు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.. సినిమాలు అటు ఇటు అయినా ఆమెకున్న మార్కెట్ తో పెట్టిన ఖర్చు అయితే వచ్చాయి.. దాంతో మినిమం హీరో రేంజ్ లో ఆమె ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వచ్చింది.. ఇక ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించగా సినిమాలకు దాదాపు పూర్తిగా దొరమైనట్లు కనిపించింది..

అయితే ఇప్పుడు ఆమె మరో నాలుగు ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. గుణశేఖర్ తన 'శకుంతలం' హీరోయిన్ గా సమంతా పేరునే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హిరణ్యకశిపను బడ్జెట్ కారణాల వల్ల వాయిదా వేసి ముందుగా శకుంతలంను పూర్తి చేయబోతున్నారు.ఇంకా మయూరి, గేమ్ ఓవర్ ఫేమ్ 'అశ్విన్ శరవణన్' డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ చేస్తున్న సమంత దాంతో పాటు 'విగ్నేష్ శివన్' రూపొందించే మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. సో రానున్న రెండేళ్లకు సమంతా డైరి చాలా బిజీగా ఉండబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: