నందమూరి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏకైక విషయం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న లెజెండ్ సినిమా షూటింగ్ అప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ విషయం మీద బాలకృష్ణ కూడా రెండు మూడు సార్లు త్వరలోనే మా వాడు లైన్లోకి వస్తాడు అని చెప్పడంతో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.


అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను పూరి జగన్నాథ్ లాంచ్ చేస్తాడనే వార్త రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే ఒక ఫైటింగ్ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మోక్షజ్ఞతో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని అంటున్నారు. లైగర్ సినిమా సక్సెస్ అయితేనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం పూరి జగన్నాథ్ కు దక్కుతుందని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ఒక సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడట పూరి జగన్నాథ్. లైగర్ సక్సెస్ అయితే కనుక ఆ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.



అయితే నిజానికి మోక్షజ్ఞ బాడీ చూస్తే ఆయన సినిమా హీరోగా లాంచ్ కావడానికి ఇంకా సిద్ధం కాలేదని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఆయన బాడీ బిల్డింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని త్వరలోనే బాడీ బాగా తగ్గించి హీరో లుక్ వచ్చే లాగా చేస్తారని అంటున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు బాలకృష్ణ కొడుకు తలుచుకుంటే బాడీ తగ్గించడం ఎంతసేపు చెప్పండి. అయితే ఈయనను లాంచ్ చేసేది పూరి జగన్నాధా లేక మరో దర్శకుడికి అవకాశం దొరుకుతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: