టాలీవుడ్ నటి బీజేపీ నాయకురాలు మాధవీ లత సోషల్ మీడియా వేధికగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ బాబుగోగినేని పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒరేయ్ తోమేస్తా కడిగేస్తా అంటూ మాధవీ లత రెచ్చిపోయింది. మాధవీ లత మాట్లాడుతూ... ఎవరో ఓ జ్యోతిష్యుడు కరోనా తగ్గిపోతుంది అని జోతిష్యం చెప్పారట. అలా జరగలేదని హిందువులపై ఏడుస్తారెంట్రా..అతడు నక్షత్రం చూసో కడుపు నింపుకోవడానికో అలా చెప్పి ఉంటాడు. అలా అనుకోకుండా చర్చలు పెట్టి హిందువులమీద పడిచస్తారేంట్రా అంటూ వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల్లో బాబు గోగినేని అనేవాణ్ణి స్టూడియోలో కూర్చోబెట్టి చర్చలు పెడుతున్నారు. 

ముఖ్యంగా బాబు గోగినేని హిందువులపై ఏడుస్తున్నాడు. అతడు హేతువాది అయితే కావచ్చు. మేము హిందువులం మా నమ్మకాలు మాకుంటాయ్. మా దేవుణ్ణి మేం నమ్ముతాం. అంతే కాని ఎవడినీ ఇంటికి వెళ్లి మా మతంలో చేరండి అంటూ పిలవం. సాంఘీక దూరాచారాలపై మాట్లాడండి దానికి సపోర్ట్ చేస్తాం. కానీ పిచ్చి పిచ్చి చర్చలు పెట్టకండి. ఆ బాబుగోగినేని హిందువుల గురించి మాట్లాడేంత గొప్పమనిషి అని నేను అనుకోవడం లేదు. అతడు ఎలాంటోడో బిగ్ బాస్ లోనే చూశాం. అతడి భజన చేసేవాళ్లను పక్కన పెట్టుకుని మిగితావాళ్లను ద్వేషించినవాడు. నేను ఎప్పటినుండో బాబు గురించి మాట్లాడుదాం అనుకుంటున్నా కానీ బిజీగా ఉండటం వల్ల మాట్లాడలేదు. 

ఇప్పుడు టైమ్ వచ్చింది. బాబు ను ఆర్గానిక్ సబ్బుతో భాగా కడిగేసి..తోమేసి మెరిపించాలనుకున్నా. నువ్ వయసులో పెద్దవాడివాని రెస్పెక్ట్ ఇవ్వనుంది..కానీ నువ్ రెస్పెక్ట్ పోగొట్టుకున్నావ్. ఎప్పుడూ జ్యోతిష్యుల మీద పడి ఏడుస్తున్నావ్. విమర్శిస్తే అన్ని మతాలను విమర్శించు. భారత దేశం గురించి మాట్లాడతావా పిచ్చి వెర్రి వెదవ..ఇంకోసారి హిందువుల గురించి మాట్లాడితే ము** మీద మూతి మీద వాతలు పెట్టి రాష్ట్రం నుండి వెలివేయాలి. ఇప్పటికే ఒకడిని రాష్ట్రం నుండి వెలివేసినా బుద్ధి రాలేదు. ఇంకా అలాగే సుత్తి మాటలు మాట్లాడుతున్నాడు. అంటూ మాధవీ లత ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇక మాధవీ లత వీడియో పై బాబు గోగినేని ఎలా స్పందిస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: