సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోగ ఇప్పటికే సగానికిపైగా సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. మహేష్ బాబు ను గతంలో ఎవరూ చూపని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాడుట దర్శకుడు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కొట్టి చాలా రోజులు వెయిట్ చేసి మరీ మహేష్ తో ఈ సినిమా చేస్తున్నాడు పరశురాం.

కీర్తి సురేష్ హీరోయిన్ గా తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు గత సినిమా సరిలేరు నీకెవ్వరు హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. ఎంతో వైవిధ్యత ఉంటే గాని కథలు ఒప్పుకొని మహేష్ బాబు ఈ సినిమాలో కూడా అలాంటి వైవిధ్యతని చూసి ఒప్పుకున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకోగా టీజర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ప్రస్తుతానికి సినిమా చివరి దశలో ఉండగా ఈ సినిమా యొక్క  విలన్ గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు ప్రేక్షకులకు. ఓ బాలీవుడ్ నటుడునీ విలన్ గా ఎంపిక చేశారని చెప్తుండగా మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ నీ విలన్ గా ఎంపిక చేశారని మరి కొంతమంది చెబుతున్నారు. అయితే అభిమానులు అర్జున్ నీ విలన్ గా ఎంపిక చేయవద్దు అని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన తెలుగులో ప్రత్యేక పాత్రలు చేసిన అన్ని సినిమా లు  ఫ్లాప్ గా నిలిచాయి. శ్రీ ఆంజనేయం ఇటీవల వచ్చిన నా పేరు సూర్య సినిమాలు సదరు హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాపులుగా నిలవగా మహేష్ బాబు కనుక ఇది చేస్తే ఈ సినిమా కూడా వాటిలాగే ఫ్లాప్ అవ్వడం ఖాయమని , మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు.  మరి అభిమానుల మాట మహేష్  వింటారా అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో ఓ సినిమాని చేస్తుండగా, రాజమౌళి తో కూడా ఇంకో సినిమాను ప్లాన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: