శ్రీకాంత్ హీరోగా నటించిన 'మాయాజాలం"  సినిమాతో పూనమ్ కౌర్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అంద చందాలతో ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా నటనతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఆ సినిమా తర్వాత  పూనం కౌర్ కి పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ కూడా ఈ భామకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇలా కెరీర్ లో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో గోపీచంద్ హీరోగా నటించిన శౌర్యం సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాలో పూన‌మ్ ఎంతో ఆక‌ట్టుకుంది. సినిమాబ్యూటీ పాత్రకు గాను 'ఫిలిం ఫేర్ అవార్డు కూడా వ‌రించింది. 

ఆ తర్వాత హీరోయిన్ పాత్రల కోసం మాత్రమే వేచి చూడడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్న ఈ హీరోయిన్ నితిన్ హీరోగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా లో హీరోయిన్ కి అక్క పాత్రలో నటించింది. అక్క‌డితో ఆగ‌కుండా కెరీర్ పూర్తిగా డీలా ప‌డ‌టంతో త‌ర‌వాత కాలంలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. పూన‌మ్ న‌టించిన సీరియ‌ల్స్ లో ఒక‌టి ఈటీవీ లో ప్రసారమైన 'స్వర్ణఖడ్గం. ఇక ఈ సీరియ‌ల్ కూడా పూన‌మ్ ను నిరాశ‌ప‌ర్చింది. దాంతో అప్ప‌టి నుండి సినిమాల‌కు సీరియ‌ల్స్ కు దూర‌మై సోష‌ల్ మీడియాకు మరింత ద‌గ్గ‌రైంది. సామాజిక రాజ‌కీయ అంశాల‌పై వివాదాస్ప‌ద పోస్టులు పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అంతే కాకుండా త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన క‌త్తిమ‌హేష్ కు ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌టంతో పూన‌మ్ ఓ సంచ‌ల‌న పోస్టును పెట్టారు.

దేవుళ్ల‌పై వ్యాఖ్యలు చేసిన ఓ వ్య‌క్తికి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిందంటూ పూన‌మ్ పేర్కొంది. అంతే కాకుండా అత‌డు కోలుకోవాలని ప్రార్థిస్థున్నా అని ఇప్ప‌టికైనా మ‌నిషిలా మారాల‌ని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ లో పేర్కొంది. మ‌రోవైపు ప్రస్తుతం పూనం కౌర్ ఇన్స్టా గ్రామ్ ,ఫేస్ బుక్ లాంటి సాంఘిక మాధ్యమాలలో తన హాట్ ఫోటోల‌తో మ‌తిపోగొడుతుంటుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మరీ ఇంత హాట్ గా ఫోటోలను పెడుతున్నారు తిరిగి పూన‌మ్ హీరోయిన్ గా నటించబోతుందా అని అనుకుంటున్నారు. అయితే దీనిపై పూన‌మ్ కౌర్ టీమ్ స్పందించింది. పూన‌మ్ స‌రదా కోసమే సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను పెడుతున్నార‌ని పేర్కొంది. అంతే కాకుండా పూన‌మ్ కు హీరోయిన్ గా న‌టించడంపై ఆస‌క్తి లేద‌ని తెలిపారు. \

మరింత సమాచారం తెలుసుకోండి: