శ్వేతా బసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా పరిచయమే. కొత్త బంగారులోకం సినిమా తో మొదటి హిట్ అందుకున్న ఈమె ఆ తర్వాత మంచి సినిమాలను రాబట్టుకోవడంలో విఫలం అయ్యింది. దానికి తోడు ఆమె పలు వివాదాల్లో ఇరుక్కోవడం కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకుండా చేశాయి. హిందీ సినిమాలలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన శ్వేతా బసు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆమె నటించిన కూడా పెద్దగా పేరు తెచ్చిన దాఖలాలు లేవు.

దాంతో ఆమె మళ్ళీ హిందీ పరిశ్రమలోకి వెళ్ళక తప్పలేదు. అక్కడ కొన్ని మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంతో మందిని అలరించిన శ్వేతాబసుప్రసాద్ జీవితంలో అత్యంత దుర్ఘటన వ్యభిచార కేసులో ఇరుక్కోవడం. 2014 సంవత్సరం హైదరాబాద్లో ఆమె వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు మొదట ఆమె నా కెరీర్లో నేను తప్పుడు ఎంపిక చేసుకున్నాను నాకు డబ్బు కావాలి అని చెప్పడం ద్వారా ఆమె వ్యభిచారం చేస్తుందని పోలీసులు భావించారు.

ఆ తర్వాత ఈ ప్రకటనను నేను చేయలేదని చెప్పడం మరొక గమనించాల్సిన విషయం. ఏదేమైనా సినిమాలో బాగా అలరించే శ్వేతా బసు ఇలా ప్రేక్షకులకు దూరం అయిపోవడం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. ఇకపోతే శ్వేత ఆ మధ్య వివాహం చేసుకుంది. 2018 సంవత్సరంలో నిర్మాత రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకోగా ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సినిమాలపై ఆమె తన ఇంటరెస్ట్ ను చూపిస్తోంది.. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు కలిసి వస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: