వెండితెరపై హీరోలు తమ వారసుల కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే టాలీవూడ్ మన్మధుడు కింగ్ నాగార్జున తన నట వారసుల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. నాగచైతన్య కెరీర్ పరంగా కొంచెం మెరుగుపడినప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. దాంతో నాగార్జున అఖిల్ సినీ జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కినేని వారసుడు అఖిల్‌ ప్రస్తుతం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అంతేకాదు.. ల‌వ్ అండ్‌ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్‌ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాతో ప్రముఖ గాయనీ చిన్మయి మొదటి వెండితెరపై కనువిందు చేయబోతున్నారు. కాగా.. చిన్మయి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ తన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక చిత్ర యూనిట్‌ ఈ సందర్భంగా  చిన్మయికి విషెస్‌ కూడా చెప్పారు.

అయితే సినిమాకి సంబంధించిన మరో విషయం ఏంటంటే.. ఈ మూవీలో చిన్మయి భర్త  నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరూ కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక.. వీరిద్దరూ జంటగానా, వీడిగానా నటిస్తున్నారా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఈ రీయల్‌ కపుల్‌ మాత్రం రీల్‌పై తొలిసారిగా సందడి చేయడం విశేషం అనే చెప్పాలి మరి. దాంతో వారి అభిమానులు వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్నిరోజులు తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూవీతో తెరపై సందండి చేయబోతున్నారు. ఇక చిన్మయి స్టార్‌ హీరోయిన్‌ సమంతకు డబ్బింగ్‌ చెబుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: