టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబినేషన్ లో ఎన్ని సార్లు తెరపై చూసిన కూడా ఏ మాత్రం బోర్ కొట్టదు. ఆ విధంగా టాలీవుడ్ లో సెన్సేషనల్ సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్ లు సాధించిన కాంబినేషన్ అల్లు అర్జున్ త్రివిక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు మరొక ప్రాజెక్టును కూడా వీరు చేయనున్నారని తెలుస్తుంది.  వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా జులాయి. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

హీరో ఇంటెలిజెన్స్ ను చూపిస్తూ తన ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ లో ఉందో చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఎంతో లాజిక్ గా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో సోనూసూద్ నటన హైలేట్ గా నిలిచింది. ఇక తొలి సినిమా ఇచ్చిన హిట్ దీనిని మరొక సినిమా చేయాలనే డిమాండ్ లేవనెత్తింది. జులాయి తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేయగా వీరి కాంబినేషన్ లో ఈ సినిమా సూపర్ డుపర్ హిట్ కాగా భవిష్యత్తులో ఇలాంటి హిట్ మరొకటి లేదనే రేంజ్ లో ఈ సినిమా హిట్ అయ్యింది.  అప్పట్లో ఈ సినిమా గురించే అందరూ చెప్పుకున్నారు.

దాంతో వీరు చేయబోయే తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ రెండు సినిమాలకు మంచి ఉండాలని చెప్పి వీరిద్దరూ కథపై కసరత్తులు చేశారు. అలా వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ చిత్రంగా వచ్చింది అలా వైకుంఠపురం లో సినిమా. ఈ సినిమా తెలుగు సినిమా లోని ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు దర్శకత్వం కలగలిపి ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కాగా ఇప్పుడు మరొకసారి తెరపైకి ఈ జోడీ వచ్చింది. అయితే ఇది సినిమా కోసం కాదు యాడ్ కోసం అని తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ యాడ్ కోసం అల్లు అర్జున్ సంప్రదించగా ఆయన ఓకే అన్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: