మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.రెగ్యులర్ కమర్షియల్  సినిమాల నుండి యూ టర్న్ తీసుకుని ఈసారి ఓ సరికొత్త జోనర్ తో వస్తున్నాడు మెగా హీరో.ఇక సినిమాలో తేజు కలెక్టర్ గా కనిపించనున్నాడు.ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు.ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.ఇక ట్రైలర్ పై ఓ లుక్కేద్దాం..'ట్రైలర్ ని చూస్తుంటే అధికార రాజకీయ వ్యవస్థలపై గట్టిగానే ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రధానంగా ప్రజాస్వామ్యం సరైన దారిలో వెళ్లాలని లేజిచ్లెచర్, జ్యుడీషియరీ లాంటి అంశాలను ట్రైలర్ లో హైలైట్ చేశారు.ఇక అధికార వ్యవస్థకు ప్రతినిధిగా కలెక్టర్ సాయి ధరమ్ తేజ్,రాజకీయ వ్యవస్థను నడిపే రమ్యకృష్ణ ను ఢీ కొని ప్రజా సమస్యల మీద ఎలా పోరాడాడు అనేదే రిపబ్లిక్ సినిమా పాయింట్ అని తెలుస్తోంది.ఇక సినిమాలో డైలాగ్స్ ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.'అదుపు తప్పిన రాజకీయ వ్యవస్థను నియంత్రించకపోతే హిట్లర్ పుడతాడు..అంటూ చాలా అర్థవంతంగా వివరణ ఇచ్చారు.ఇక సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది.ఇక సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటించారు.

ట్రైలర్ లో సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ పాత్రల మధ్య కొనసాగే సీరియస్ కథనాన్ని ట్రైలర్ లో జస్ట్ శాంపిల్ గా చూపించారు.ఇక సినిమాలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పొచ్చు. ఇక చాలా గ్యాప్ తర్వాతదర్శకుడు దేవా కట్టా మంచి పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు తేజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తేజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: