ఇదిలా ఉంటె ఈ సినిమా కంటే ముందు నుంచే దర్శకుడు దేవా కట్టాకి మంచి సినిమాలు తీస్తాడు అనే మంచి పేరు ఉంది.కానీ అతనికి కమర్షియల్ హిట్లు మాత్రం లేవు. ఇకపోతే తాజాగా వస్తున్న 'రిపబ్లిక్' నిర్మాతలైతే.. ఇప్పటివరకు వాళ్ళు హిట్టు మొహమే చూసింది లేదట.కానీ సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి' 'ప్రతిరోజూ పండగే' 'సోలో బ్రతుకే సో బెటర్' వంటి చిత్రాలు అన్నీ కూడా మంచి హిట్ తెచ్చిపెట్టాయి.దీనితో ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటుంది అని ఫాన్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటె ఈ కథలో చాలా బలం ఉందని నమ్మి సాయి ధరమ్ తేజ్ తో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని చేయించడం జరిగింది.
అయితే మూవీ విషయంలో మెగాస్టార్ రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయట.విషయానికొస్తే రిపబ్లిక్ సినిమా కథను మొదటగా సాయి ధరమ్ తేజ్ కి అనుకోలేదట.తేజ్ కి ఈ చిత్రం కథని వినిపించక ముందే నాగ చైతన్యకి వినిపించాడట.అయితే ఈ సినిమా కథను 'ఆటో నగర్ సూర్య' టైంలోనే నాగ చైతన్యకు వినిపిచినట్టు తెలుస్తుంది.కథ విన్న సమయంలో సానుకూలంగా స్పందించారు.అయినప్పటికీ దాని తరువాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.తనతో పాటు దేవా కట్టా కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు.అందుకే వీరి కాంబో రిపీట్ అవ్వలేదు...!!