మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం 'రిపబ్లిక్'. ఈ సినిమా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని 'జె.బి.ఎంటర్టైన్మెంట్స్' 'జీ స్టూడియోస్' బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు.ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.అంతేకాకుండా రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. కానీ ట్రైలర్ మాత్రం పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.కానీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన  స్పీచ్ వల్ల ఈ సినిమా పై అందరి దృష్టి పడింది అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటె ఈ సినిమా కంటే ముందు నుంచే దర్శకుడు దేవా కట్టాకి మంచి సినిమాలు తీస్తాడు అనే మంచి పేరు ఉంది.కానీ అతనికి కమర్షియల్ హిట్లు మాత్రం  లేవు. ఇకపోతే తాజాగా వస్తున్న   'రిపబ్లిక్' నిర్మాతలైతే.. ఇప్పటివరకు వాళ్ళు హిట్టు మొహమే  చూసింది లేదట.కానీ సాయి ధరమ్ తేజ్ నటించిన  చిత్రలహరి' 'ప్రతిరోజూ పండగే' 'సోలో బ్రతుకే సో బెటర్' వంటి చిత్రాలు అన్నీ కూడా మంచి హిట్ తెచ్చిపెట్టాయి.దీనితో ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటుంది అని ఫాన్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటె ఈ కథలో చాలా బలం ఉందని నమ్మి  సాయి  ధరమ్ తేజ్ తో  మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని చేయించడం జరిగింది.

అయితే మూవీ విషయంలో మెగాస్టార్ రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయట.విషయానికొస్తే రిపబ్లిక్ సినిమా కథను మొదటగా సాయి ధరమ్ తేజ్ కి అనుకోలేదట.తేజ్ కి ఈ చిత్రం కథని వినిపించక ముందే నాగ చైతన్యకి వినిపించాడట.అయితే ఈ సినిమా కథను 'ఆటో నగర్ సూర్య' టైంలోనే నాగ చైతన్యకు వినిపిచినట్టు తెలుస్తుంది.కథ విన్న సమయంలో సానుకూలంగా స్పందించారు.అయినప్పటికీ దాని తరువాత నాగ చైతన్య వరుస  సినిమాలతో బిజీ గా ఉన్నారు.తనతో పాటు దేవా కట్టా కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు.అందుకే వీరి కాంబో రిపీట్ అవ్వలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: