తెలుగు సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి గురించి తెలియని వారంటూ బహుశా ఎవరూ ఉండరు.. ఈమె ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అందరిని ఫిదా చేసేసింది. అంతేకాదు ఈమె డాన్స్ కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈమెకు ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు సెలబ్రిటీలు కూడా ఈమెకు అభిమానులు గా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డీ డాన్స్ జూనియర్ ద్వారా విజేతగా నిలిచిన సాయి పల్లవి, తన డాన్స్ తో ఎటువంటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక కేవలం డాన్స్ మాత్రమే కాదు ఈమె నటనను కూడా అద్భుతం అని అనాల్సిందే.


ఎంతో మంది స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, పాత్ర నచ్చితేనే ఒప్పుకుంటాం అని చెప్పి ఎన్నో సినిమాలను వదులుకున్న  సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే సాయి పల్లవి తాజాగా నాగచైతన్య తో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్  విజయాన్ని అందుకోవడమే కాకుండా వీరిద్దరూ కెరియర్ లో కూడా అతిపెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కూడా ఈ సినిమా నిలిచి పోవడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి , నాగచైతన్య జోడీ కూడా సూపర్ అంటూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి.


ఇక ఈమె చదువు విషయానికి వస్తే, సాయి పల్లవి జార్జియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా అందుకుని, డాక్టర్ సేవలను అందించడానికి సిద్ధం అయినట్లు సమాచారం.. ఈమె తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు మీడియా ముందు వెల్లడించింది ఎందుకంటే తన చుట్టూ ఉన్న ఎంతో మంది వ్యక్తులకు సహాయం చేయడం కోసం తిరిగి తన డాక్టర్ వృత్తిని చేపట్టాలని అనుకుంటున్నట్లు తెలిపింది.. ఒకపక్క డాక్టర్ వృత్తిని చేస్తూనే, మరో పక్క ఛాలెంజింగ్ రోల్స్ వస్తే మాత్రం కచ్చితంగా నటిస్తానని కూడా తెలిపింది.. సాయి పల్లవి తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు . సాయిపల్లవి ఇక సినీ ఇండస్ట్రీలో కనిపించదేమో అంటూ తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: