షారుఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్ అరెస్టు మరియు ఎన్సీబీ కస్టడీపై జాతీయ మీడియాతో సికందర్ మాట్లాడారు. ఆర్యన్ ఖాన్ కేసు గురించి అడగగా.. `నేను ప్రత్యేకంగా ఎవరినీ పేర్కొనడానికి ఇష్టపడను. నేను ఏదైనా చెప్పగలను కానీ, చట్టం తన పని తనని చేసుకోనివ్వండి. అతడు దోషి, ఆమె దోషి, మీరు హంతకుడు ` అని నేను ఎలా చెప్పగలను అని ప్రశ్నించారు. దేనిపైన అయిన మాట్లాడే ముందు నోరును అదుపులో పెట్టుకోవాలన్నారు. నోరు అతని గురించి లేదా ఇంకెవరి గురించి మాట్లాడుతుందో ? అని, ఒక వ్యక్తిగా వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను, మీరు ఎవరి గురించైనా నోరు పారేసుకోవద్దు` చెప్పారు.
అయితే, ఇది ఏకపక్ష సమస్య కాదని, అలాంటి విషయాలు చదవాలనుకునే లేదా చూడాలనుకునే వారు ఉన్నందున ఇది జరుగుతుందని చెప్పారు. మనుషులు సులువుగా ప్రతికూలత వైపు మళ్లుతారు అని భావించారు. అలాంటి క్షణాల్లో సానుకూలంగా ఉండడమే కఠినమైన పరిస్థతి అని చెప్పుకొచ్చారు. ఒకరిపై తీర్పు ఇవ్వడం లేదా వారి పాత్రపై వేలు చూపడం చాలా సులభం అని చెప్పారు. కోవిడ్ -19 మరియు గత రెండేళ్లు మాకు నేర్పిన పాఠం వల్ల దయగా ఉండాలని నేర్చుకున్నానన్నాడు. ఒకరికొకరు కృతజ్ఞతతో ఉండండి అంటూ సూచించారు. ప్రజలు దయపై ఎక్కువ దృష్టి పెట్టాలని మరియు అది మానవత్వానికి పెద్ద సందేశం కావాలని ఆశిస్తున్నానని చెప్పారు.