ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటి అంటే.. ససమంత,చైతన్య విడాకులే అని తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా లేదా అనేదానిమీద చర్చ జరిగుతుంది ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారని అస్సలు తప్పు ఎవరిది అనేది చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. కొందరు సమంతది తప్పు అంటుంటే  ఇంకొందరు చైతన్య తప్పు చేశాడని అంటున్నట్లు సమాచారం. ఇక వీటిపై ఆ జంట క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఎందుకంటె అది వారి వ్యక్తిగత విషయం అని ప్రముఖులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ జంట విడాకులపై పలు రకాలుగా స్పందించారని తెలుస్తుంది. ఇక తాజాగా ఈ విషయమై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారినట్లు తెలుస్తుంది.

సమంత- నాగ చైతన్య విడాకుల విషయంలో మాధవీలత ఘాటు ఆరోపణలు పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయని తెలుస్తుంది. సమంతను అక్కినేని ఫ్యామిలీ వాడుకొని వదిలేశారని అలాగే ఆమెకు తల్లి కావాలని ఉన్నా డబ్బు కోసం ఆమెను పని రోబోట్ లా మార్చరని ఆరోపించినట్లు సమాచారం.సమంత డ్రెస్సింగ్ వలనే చైతూ విడాకులు ఇచ్చాడని అందరు అంటున్నారని అయితే మిగతా వారందరు ఏమైనా మంచిగా ఉన్నారా అని ప్రశ్నించిందట.పెళ్లి మండపం నుంచే విడాకుల కోసం కోర్టు మెట్లపై నిలబడిన జంటలను చాలా చూశానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇక నాగార్జున మొదటి భార్య గురించి ఎవరు ఎందుకు మాట్లాడం లేదని ఆమె అడిగినట్లు సమాచారం. సమంత గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవీలత సమంతను అక్కినేని ఫ్యామిలీ వాడుకొని వదిలేసిందని తెలిపినట్లు సమాచారం.

ఆమె కోట్లు సంపాదించినా ఆమెకు నెలకు పాకెట్ మనీ మాత్రం వేలల్లోనే ఇస్తారని ఆమె చెప్పిందట.వాటితోనే ఆమె బతకాలని తెలిపినట్లు సమాచారం. సమంత క్రిస్టియన్ అయినా హిందూ మతాలను గౌరవించిందని అలాగే గుళ్లు మరియు గోపురాలకు కాలినడకతో వెళ్లిందని తెలిపినట్లు సమాచారం.సమంత చాలా మంచి మనిషి అని, ఆమెను డబ్బుకోసం నాగార్జున ఫ్యామిలి ఒక ఏటీఎం లా మాత్రమే చూశారని అలాగే 30 ఏళ్ల వయస్సులోనే తల్లి కావాలనుకున్న ఆమెను ఇలా చేయడం అన్యాయమని చెప్పుకొచ్చిందట.ప్రస్తుతం మాధవీలత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: