సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో చెప్పడం చాలా కష్టం.. ఇక అలా ఎంతోమంది టిక్ టాక్ మొదలుకొని యూట్యూబ్ వరకు తమ నటనతో , అలాగే తమ లో ఉన్న టాలెంట్ ను బయట పెడుతూ బాగా పాపులర్ అవుతూ అందరి దృష్టిలో పడుతున్నారు కొంతమంది యువత. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ ని అందుకున్న వీరికి సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.. కొంతమందికి జూనియర్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే మరికొంతమందికి సింగర్ గా కూడా అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా తమా పాపులారిటీని సంపాదించుకుని ఏకంగా పాన్ ఇండియా మూవీలో పాట పాడే అవకాశాన్ని కొట్టేసింది ఓ అమ్మాయి..ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదే క్రమంలోనే తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ గా వస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా నుంచి తాజాగా సామి సామి పాట విడుదల అయ్యి .. ప్రేక్షకులు సినిమాపై మరింత ఊహాగానాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ పాట పాడిన అమ్మాయి ఎవరు అంటూ తెగ వెతికేస్తున్నారు.. ఇక పుష్ప మూవీలో సామి సామి సాంగ్ తో బాగా పాపులారిటీ నీ అందుకున్న అమ్మాయి పేరు మౌనిక..ఈ పాటతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలంగాణా బ్రాండ్ ని ఉపయోగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. పుష్ప మూవీలో మౌనికతో పాడించి సెన్షేషన్ క్రియేట్ చేశాడు. సరిలేరు నీకెవ్వరూ మూవీలో హీ ఇస్ సో క్యూట్ అనే పాటని మధుప్రియతో పాడించాడు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఫోక్ సింగర్ మౌనికతో పాడించి,  మరో రికార్డ్ క్రియేట్ చేశాడు దేవీ. ఈ నేపథ్యంలో మంగ్లీ మాదిరిగా మౌనిక కు కూడా భారీ క్రేజ్ వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో పుట్టిన మౌనిక యాదవ్..గోదావరి ఖనిలో పెరిగింది. డిగ్రీ చేసిన ఈమె సింగర్ అలాగే డాన్సర్ కూడా. పాఠశాల రోజుల నుంచి టీచర్స్ , ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ఎన్నో పాటలు  పాడింది. తెలంగాణ ఉద్యమంలో ఈమె గొంతు జోరుగా వినిపించింది. ఉద్యోగం చేస్తూనే సింగర్ గా కూడా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: