నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తీసిన అతడు సినిమాతో దర్శకునిగా తానేంటో నిరూపించుకోవడం మాత్రమే కాకుండా ఓ బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది.. ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గతేడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను సాధించాడు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో రెండు సినిమాలు తీయగా.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు తెరకెక్కించాడు. అలాగే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఇక పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు మాటలు అందిస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు.
నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తీసిన అతడు సినిమాతో దర్శకునిగా తానేంటో నిరూపించుకోవడం మాత్రమే కాకుండా ఓ బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది.. ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గతేడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను సాధించాడు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో రెండు సినిమాలు తీయగా.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు తెరకెక్కించాడు. అలాగే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఇక పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు మాటలు అందిస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు.