మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ , రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమా లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా తో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లను శర వేగంగా పూర్తి చేస్తున్న రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో లో ధమాకా సినిమా లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు త్రినాథరావు నక్కిన ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది .అయితే ఈ సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది, ఈ సినిమా లో ఒక ప్రత్యేక పాట కోసం మొదటగా చిత్ర బృందం అనసూయను అనుకొని ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకున్నట్టుగా తెలుస్తుంది. కాక పోతే చివరగా ధమాకా చిత్ర బృందం ఈశా రెబ్బ ను ఈ ప్రత్యేక సాంగ్ కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఈషా రెబ్బా రవితేజ సినిమాలో అదిరిపోయే ఆఫర్ ను దక్కించుకుంది. రవితేజసినిమా లతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వం లో ఒక సినిమాలో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: