తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర శ్రేణి కుటుంబాల్లో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన హీరో మొదటి పెళ్లి  పెద్దలు కుదిర్చిన పెళ్లి గా చెబుతారు. కానీ ఆ హీరో మొదటి పెళ్లి సైతం ప్రేమ వివాహమే , ఇంతకీ ఎవరూ ఆ హీరో? ఎవరితో ప్రేమలో పడ్డాడు ? 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి రెండు కళ్ళు నట దిగ్గజాలు ఎన్టీఆర్ , ఎన్నార్ ల వారసులు బాలకృష్ణ, నాగార్జున లు సైతం తర్వాత కాలంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని అగ్ర నటులు గా ఎదిగి ఇప్పటికి కొనసాగుతున్నారు.  

వీరిద్దరి లో నాగార్జున వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నవమన్మథుడు గా పిలుచుకునే నాగార్జున రెండు సార్లు వివాహం చేసుకున్నాడు.మొదటి వివాహం పెద్దలు కుదిర్చినది, రెండో వివాహం ప్రేమ వివాహం.కానీ నాగార్జున మొదటి వివాహం అందరూ అనుకుంటున్నట్లు పెద్దల కుదిర్చిన వివాహం కాదు అది కూడా ప్రేమ వివాహం.

అమెరికా లో ఉన్నత విద్యను పూర్తి చేసిన నాగార్జున అక్కడే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు ఏకైక కుమార్తె లక్ష్మీ తో ప్రేమ లో పడి మునిగి తెలుతున్న సమయంలో తండ్రి నాగేశ్వరరావు కోరిక మేరకు ఇండియా వచ్చి నటుడిగా రంగప్రవేశం చేసినా లక్ష్మీ తో ప్రేమాయణం కొనసాగించారు. 

 ఈ సమయంలో నే నాగేశ్వరరావు గారు నాగార్జున కి వివాహ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నటి సుమలత ను సైతం సంప్రదించంగా ఇప్పుడే వివాహం చేసుకునే ఆలోచనలు లేవని చెప్పడం కూడా జరిగింది అని బహిరంగ రహస్యం. తండ్రి తన వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు గుర్తించిన నాగ్ తన మనసులోని మాటను చెప్పడంతో వెంటనే రామానాయుడు గారిని సంప్రదించగా , నాయుడు గారు తొలుత విముఖత చూపినా కూతురి అంగీకారంతో ఒప్పుకున్నారు. ఆరోజుల్లోనే వారిద్దరి వివాహం చాలా ఖరీదైనది గా ఇప్పటికీ చెప్పుకుంటారు. 

నాగచైతన్య పుట్టే వరకు సవ్యంగా సాగిన వారి వివాహ బంధం తరువాత కాలంలో అభిప్రాయ భేదాలు రావడం తో పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారి విడాకులకు ముఖ్య కారణం నాగార్జున, తనతో నటించిన హీరోయిన్లతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు అని చెప్పుకుంటారు. ఈ విషయం మీదే వారు విడిపోయారు . 

విరివూరు విడిపోయిన తర్వాత నాగార్జున తన మీద వచ్చిన గాసిప్స్ నిజం చేస్తూ తనతో పలు చిత్రాల్లో నటించిన అమలా ను వివాహం చేసుకోగా వీరి కుమారుడు అఖిల్ హీరో గా ఉన్నాడు. నాగార్జున తో విడాకులు తీసుకున్నా తర్వాత నాగచైతన్యతో కలిసి లక్ష్మీ  విడిగా చెన్నై లో ఉండేది,  ఆర్కిటెక్ట్ కావటంతో ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ నాయుడు గారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఒక ప్రముఖ కార్పోరేట్ ఉద్యోగి ని రెండో వివాహం చేసుకొంది. ప్రస్తుతం విరివూరు తమ తమ  జీవిత భాగస్వాములతో  హాయిగా బ్రతుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: